ఆరు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం
టీకేఆర్ కాలేజ్ ఐటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): హైదరాబాద్లోని టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎన్బీఏ గుర్తింపు, నాక్ ‘ఏ+’ గ్రేడ్) ఐటీ విభాగం ఆధ్వర్యంలో, ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్(ఏటీఎల్) అకాడమీ సహకారంతో ‘ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రవాణా రంగాలలో క్వాంటం కంప్యూటింగ్, ఏఐల అనుసంధానం’ అనే అంశంపై ఆరు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం జూలై 20 నుంచి 25 వరకు విజయవంతంగా నిర్వహించారు.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూవోహెచ్), జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ల కు చెందిన ప్రముఖ నిపుణులు ఈ ఎఫ్డీపీని నిర్వహించారు. వీరు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం మెషిన్ లెర్నింగ్ (క్యూఎం ఎల్), క్వాంటం అల్గారిథమ్లు, క్వాంటం న్యూరల్ నెట్వర్క్లు (క్యూఎన్ఎన్), ఫొటోనిక్ క్వాంటం కమ్యూనికేషన్ వంటి అంశాల పై విపులమైన సెషన్లను అందించారు.
ఈ సెషన్లు పాల్గొన్నవారికి క్వాంటం టెక్నాలజీలలోని తాజా పురోగతులు, వాటిని ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానించడం పై సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అంతర్దృష్టులను కూడా అందించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్స్డ్ కంప్యూటింగ్ను సందర్శించి, అ క్కడ క్వాంటం కంప్యూటింగ్ ప్రయోగశాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రామస్వామి రెడ్డి, యాజమాన్యం, ఎఫ్డీపీ కోఆర్డి నేటర్, పాల్గొన్నవారు,నిర్వహణ కమిటీ వారి నిరంతర ప్రోత్సాహం, మద్దతుతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.






