27 February, 2026 | 6:21 PM

గృహ ప్రవేశ మహోత్సవంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

27-02-2026 04:16 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని అడవసోమనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సేగ్గం రాజేశ్–సబిత కుమార్తె మంథని ధరణి-విద్యాసాగర్ నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... నూతన గృహం ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.