వేమునూరి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
13-04-2026 12:37 AM
మంథని, ఏప్రిల్ 12(విజయ క్రాంతి) మంథని నియోజకవర్గంలోని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి గుండెపోటుకు గురై హన్మకొండలోని ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం ఆసుపత్రికి వెళ్లి వేమూనూరి ప్రభాకర్ రెడ్డిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




