30 June, 2026 | 9:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం

30-06-2026 09:02 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సహకార వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ, నాగనారాయణ మాట్లాడుతూ సహకార సంఘాలు, ఎఫ్‌పీఓలు సమన్వయంతో పనిచేస్తే రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని, ఎఫ్‌పీఓలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎఫ్‌పీఓల ఏర్పాటు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, సహకార సంఘాల బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, డైరెక్టర్లు  పాల్గొన్నారు.