ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోర్గి మోడల్ స్కూల్ విద్యార్థులు
నాగలిగిద్ద, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాగలిగిద్ద మండలం మొరిగి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో 90 మంది విద్యార్థులకు గాను 65 మంది ఉత్తీర్ణత సాధించారు. బైపీసీ గ్రూప్కు చెందిన బిరాధర్ వైష్ణవి 948 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది. అదే గ్రూపులో నాగపురి వైష్ణవి 911 మార్కులు, సీఈసీ గ్రూపులో వి.వైష్ణవి 697 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సువర్ణ తెలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 85 మందికి 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ గ్రూప్కు చెందిన జి.స్నేహ 427 మార్కులతో ప్రథమ సంవత్సరంలో కళాశాల టాపర్గా నిలిచింది. బైపీసీ గ్రూప్ జి.కీర్తి, సుప్రియ చెరో 402 మార్కులు సాధించారు. తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 59 శాతం ఉత్తీర్ణత, రెండవ సంవత్సరం 69 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపాల్ ఇంద్రజ వెల్లడించారు. మోర్గి మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.




