30 June, 2026 | 9:40 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి

30-06-2026 08:43 PM

- కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తాం

గుండాల,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను బోధిస్తున్నాయని మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆధునికమైన మౌలిక వసతులతో కూడిన క్లాస్ రూములు, డిజిటల్ క్లాస్ రూమ్, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్ కు సంబంధించిన పరికరాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ప్లే గ్రౌండ్, బాత్రూం, లెట్ రూమ్స్ కలవని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, స్వచ్ఛమైన తాగునీరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఉన్నారని, చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులుతో పాటు ఉపాధ్యాయులు శరత్ బాబు, ఉపాధ్యాయురాల్లు రాజ్యలక్ష్మి, వెన్నెల, ప్రమీల, శకుంతల లు విజ్ఞప్తి చేశారు.