30 April, 2026 | 2:06 AM

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువత భవిష్యత్ సురక్షితం

30-04-2026 12:49 AM

ఎస్‌ఐ చలికంటి నరేష్

గరిడేపల్లి, ఏప్రిల్ 29 : డ్రగ్స్ దూరంగా ఉంటే యువత భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఎస్‌ఐ చలికంటి నరేష్ అన్నారు.మండల కేంద్రంలో గరిడేపల్లి లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్ర మంలో భాగంగా పోలీసులు బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆరోగ్యం, చదువు, కు టుంబ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు.డ్రగ్స్కు బానిసైన యువత నేరాల బాట పట్టే ప్రమాదం ఉందని తెలిపారు.సమాజాన్ని మత్తు పదార్థాల బారినుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

డ్రగ్స్ విక్రయాలు,వినియోగంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు,  డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది సుంకరి నగేష్,గోపి, ప్రశాంత్,మల్లయ్య,షబ్బీర్,  తదితరులు పాల్గొన్నారు.