ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే
27-06-2026 02:23 PM
కుబీర్ (విజయ క్రాంతి): కుబీర్ మండలంలోని జామ్ గావ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. అరులైన పేదలకు ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. అంతకుముందు గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ఉన్నారు.






