13 May, 2026 | 11:39 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

17-01-2026 12:52 AM

ధర్మపురిలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

ధర్మపురి, జనవరి : ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనీ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను అదేశించారు. శుక్రవారం ధర్మపురి మండలకేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగా ణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందన్నారు.ఇటుక, కంకర ధరల నియంత్ర ణకు, ఇండ్ల లబ్ధిదారులకు ధరలు అనుగుణంగా ఉండేలా అధికారులు కమిటీ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు .ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెనుకబడి ఉన్నట్లయితే వేగవంతం పెంచాలని,గడువులోపు వారికి కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకుఆర్థిక పరమైన సమస్యలుంటే ఐకేపి, మెప్మా సహకార సం ఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హౌసింగ్ డిఈ భాస్కర్, ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.