23 April, 2026 | 4:47 AM

ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత

23-04-2026 12:30 AM

బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న కార్మికులు

కల్వకుర్తి ఏప్రిల్ 22 : కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. సాయంత్రం సమయంలో కార్మికులు ధర్నా కొనసాగిస్తుండగా, పోలీసులు రక్షణ మధ్య మూడు బస్సులను డిపో నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే, మరో బస్సు బయటకు వస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో కొంత మంది ఆగ్రహంతో బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు డ్రైవ్ప కారం పొడి చల్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ మోహరించారు. ఉద్రిక్తత పెరగడంతో బయటకు పంపిన బస్సులను తిరిగి డిపోకు తరలించారు.