కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
29-04-2026 09:34 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ఎస్ఎస్సి 2026 ఫలితాలలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలబడ్డారు. పాఠశాల విద్యార్థిని ఓ. నిత్యశ్రీ 571/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, వెంగల ఈశ్వర్ 568/600 మార్కులతో ద్వితీయ స్థానం, బొల్లు రిషిత 565/600 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. అదేవిధంగా పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ యం. రాజ రమేష్ అభినందించారు.






