23 April, 2026 | 2:15 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం

23-04-2026 12:43 PM

ఆర్టీసీ కార్మికుల సమస్యలను రోడ్డున పడేస్తే.. మరో ఉద్యమానికి శ్రీకారం

 తలసాని కీలక వ్యాఖ్యలు — సారాంశం

స్థలం          : సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో

పార్టీ          : బీఆర్ఎస్

హెచ్చరిక        : డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడి

కాంగ్రెస్‌పై చాలెంజ్: 29 డిమాండ్లు పరిష్కరించారంటే నిరూపించండి

electric buses   : ప్రైవేట్ డ్రైవర్లు కాదు — ఆర్టీసీ వారే నడిపించాలి

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC workers strike) కొనసాగుతోంది. దీంతో ఆర్టీసీ యాజమాన్య ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది. సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేస్తునున్నారు. ఆర్టీసీ కార్మికుల నిరసనలో మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలని తలసాని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తామని తలసాని హెచ్చరించారు. కేబినెట్ భేటీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చేపాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఆర్టీసీలో ఇప్పుడు రెండు రకాల డ్రైవర్లున్నారు — రెగ్యులర్ ఆర్టీసీ కార్మికులు, మరియు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే ప్రైవేట్ కాంట్రాక్ట్ డ్రైవర్లు. ప్రభుత్వం electric buses నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. దీన్నే కార్మికులు వ్యతిరేకిస్తున్నారు — భవిష్యత్తులో తమ ఉద్యోగాలు పోతాయని భయంతో. తలసాని కూడా ఇదే అభ్యంతరం వ్యక్తం చేస్తూ electric buses ని ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మె తాజా పరిణామాలు, తెలంగాణ రాజకీయ వార్తలు నిమిషాల వ్యవధిలో తెలుసుకోవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.

బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులను సమ్మె  చేయమన్నారని మంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. అలా అనడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా? అంటూ తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లు పెడితే 29 డిమాండ్లను పరిష్కరించామని నిన్న చెప్తారన్న తలసాని కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే క్లియర్ చేసిన 29 డిమాండ్లు ఏంటో మీడియా ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కార్మికులు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. ఇదే అసలు విరోధాభాసం. పరిష్కారం జరిగిందంటే సమ్మె ఎందుకు కొనసాగుతోంది? ఆ 29 డిమాండ్లు ఏంటో అధికారికంగా వివరించమని తలసాని అడగడం వెనుక ఇదే లాజిక్ ఉంది. కార్మికులు సంతృప్తి పడినప్పుడే సమ్మె ముగుస్తుంది — ప్రభుత్వం పేపర్‌పై పరిష్కరించినా జేఏసీ అంగీకరించాల్సిందే. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలకు రాకపోతే యాక్షన్ తీసుకుంటామని కార్మికులకి వార్నింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్  ప్రభుత్వమే అన్న మాజీ మంత్రి ముందు మీ ఉద్యోగాలు కాపాడుకోండని చురకలంటించారు. 


ఆర్టీసీ సమ్మెపై అన్ని పార్టీల స్పందనలు, తెలంగాణ తాజా రాజకీయ వార్తల కోసం మా పొలిటిక్స్ విభాగం చదవండి.