దేవాలయ భూములకు సర్వే
11-05-2026 09:21 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండేపూడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన భూమి సర్వే నంబర్లు 348, 374, 375, 376, 379 పరిధిలో ఉన్న మొత్తం 8 ఎకరాలు 13 గుంటల భూమికి సంబంధించి అధికారులు సర్వే చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో అన్యాక్రాంతానికి గురైన 1 ఎకరం 30 గుంటల దేవాలయ భూమిని గుర్తించి తిరిగి హద్దులను నిర్ణయించారు. హద్దు రాళ్లను ఎవరైనా తొలగించినట్లయితే దేవాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






