నవ దంపతుల ఆత్మహత్య
కూకట్పల్లి, మే ౨ (విజయక్రాంతి): నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కుమ్మరి బస్తిలో శనివారం చోటుచేసుకుంది. ఐటీసీ లో సేల్స్ ఎక్స్ క్యూటివ్గా పనిచేస్తూ కుమ్మరి బస్తీలో నివసించే యంజాల కార్తీక్(28) అదే బస్తీకి చెందిన ఎర్రమళ్ళ లక్ష్మణ్ కుమార్తె మంజుల (27)ను ఇష్టపడి మార్చి 8న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అనన్య ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్కు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రాగా పోలీసులు ఆసుపత్రి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తులో భార్య మంజుల నోటి నుంచి నురగలు వచ్చినట్లు, భర్త కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.ఇద్దరి ఆత్మ హత్యలకు నవ దంపతుల మధ్య కుటుంబ కలహాలే కారణమా లేక మరి ఏదైనా కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






