30 June, 2026 | 10:19 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పదో తరగతి ఫలితాలలో జయ ప్రభంజనం

29-04-2026 07:05 PM

కోదాడ,(విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలలో కోదాడలోని జయ పాఠశాల నుండి 149 మంది విద్యార్థులలో 570 పైగా 10 మంది 560 పైగా 24 మంది 550 పైగా 48 మంది విద్యార్థులు 500కు పైగా 124 మంది విద్యార్థులు ప్రతిభను చాటారని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు. బుధవారం మాట్లాడుతూ... పాఠశాల నుండి 10వ తరగతి పరీక్షలకు హాజరైన మొత్తం 149 మంది విద్యార్థులలో 149 మంది పాసైనారు.

వీరిలో టి.శ్రీజరెడ్డి 593 మార్కులతో మొదటి స్థానం ఎస్. హీరాతన్వీర్ 588 మార్కులతో రెండవ స్థానం, ఎమ్. త్రినయని 579 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. ప్రతిభను కనబరచిన విద్యార్థినీ విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, సహకారం అందించిన తల్లిదండ్రులను అభినందించారు. పాఠశాల డైరెక్టర్లు బింగి.జ్యోతి, జెల్లాపద్మ, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు పాల్గొన్నారు.