15 June, 2026 | 9:02 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

పతంగులకు చైనా మంజా ధారలు వాడితే చర్యలు తప్పవు

30-12-2025 05:08 PM

ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి సర్కిల్ నిషేధించిన చైనా మాంజా (సింథటిక్, నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారని సీఐ ఎల్లారెడ్డి, దొరగారి రాజారెడ్డి తెలిపారు. రాఖీ, సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజా ఎక్కడా విక్రయించకూడదని, గోడౌన్లు, మార్కెట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.

నైలాన్, సింథటిక్ దారాలతో తయారైన ఈ చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, పశువులు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గాలిపటాలు ఎగరేసే సమయంలో అనేక పక్షులు6 తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ కుమార్ దుకాణ సముదాయ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.