విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ
15-06-2026 08:58 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడు పరిధిలోని బత్తులనగర్ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సపావత్ బాలకృష్ణ చౌహాన్, ఉపాధ్యాయులు భాస్కర్ చేతుల మీదుగా సోమవారం ఉచితంగా నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పాటు నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు మంచిగా విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






