15 June, 2026 | 7:52 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రైతులకు సరిపడా యూరియా నిల్వలు

30-12-2025 06:39 PM

అచ్చంపేట: రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచామని అచ్చంపేట మండల వ్యవసాయ అధికారి కే.కృష్ణయ్య తెలిపారు. యూరియా కొరత ఉందనే మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని హెచ్ఏసిఏ కేంద్రంలో యూరియా నిల్వలను పరిశీలించారు. మండలంలోని రైతులకు అచ్చంపేటలోని పిఎసిఎస్, హెచ్ ఏ సి ఏ ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా పంపిణీ, విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే యూరియా విక్రయాలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అనధికార విక్రయాలు జరిగితే సహించేది లేదన్నారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేసుకోవద్దని సూచించారు.