15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

15-06-2026 05:54 PM

• అదనంగా రెండు కొత్త ప్లాట్ ఫామ్ లు, 13 రూట్లలో కొత్తగా బస్ సౌకర్యం

• సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆర్టిసి కరీంనగర్ ఈడీ సోలామన్  కరీంనగర్ ఆర్ఎం రాజు, జగిత్యాల డిపో మేనేజర్ తో కలిసి ధర్మపురి బస్టాండ్ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి  అడ్లూరి మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గానికి ఐటిఐ తో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని త్వరలోనే బస్సు డిపో సాధిస్తామని అన్నారు. ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు. ధర్మపురి నుండి నిత్యం 4వేల నుంచి 5వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రత్యేక నిధులతో బస్టాండ్ లో రెండు కొత్త ప్లాట్  ఫాంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.