గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు
* ధాన్యం నిలవలలో రైతుల జాగ్రత్తలు
డాక్టర్ మరియాదాస్
గరిడేపల్లి,(విజయక్రాంతి): గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకున్నట్లయితే రైతులు అధిక లాభాలని పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ మరియాదాస్ తెలిపారు. మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రంలో సోమవారం వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ ఆక్ట్, నెగోషియబుల్ వేరే హౌస్ పై రైతులకు, వ్యాపారులు,పప్పు మిల్లు యజమానులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేర్ హౌసింగ్ నెగోషియబుల్ రిసిప్ట్ అంటే ఏమిటో వివరించారు.
వీటి ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనే అంశంపై వివరించారు. పొలాల్లో ఎలుకల యాజమాన్యం పై ఆయన క్లుప్తంగా వివరించారు. రైతులు ధాన్యం నిల్వలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆహార ధాన్యాలను కాపాడుకోవచ్చని, లేకుంటే 10 నుంచి 30% దాన్యం చీడపురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిలువపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిల్వ సమయంలో ఉపయోగించే హెల్మెట్రిక్ బ్యాగుల ఉపయోగాలను ఆయన వివరించారు.






