కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ
15-06-2026 06:46 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి కోర్టులో క్లయింట్ల వేయింటింగ్ కోసం నితిన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు సిమెంట్ బెంచిలను ఏర్పాటు చేశారు.సోమవారం నాలుగు సిమెంట్ బెంచీలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... క్లయింట్ల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మీడియాషన్ కో ఆర్డినేటర్లు అయినా ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణు గోపాల్, పసునూరి శ్రీనివాస్ లు నితిన్ చారిట్రబుల్ ట్రస్ట్ కి సమాచారం అందించగా, ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. రాణావేని సత్యనారాయణ వెంటనే స్పందించి బెంచీల్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు. క్లయింట్ల సౌకర్యర్థం బెంచీలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.






