19 June, 2026 | 5:06 PM

Breaking News

ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •   అన్న-అక్క మెంటార్‌షిప్ శిబిరం   •   చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •   అనగారిన వర్గాల ప్రజల కోసం రాహుల్ గాంధీ పోరాటం   •   కాంగ్రెస్ నాయకుల మర్యాదపూర్వక భేటీ   •  

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

19-06-2026 03:42 PM

తహశీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపుమేరకు స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కొరుతూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జి.వో.272 సవరణ చేసి దోంగ బంగారం రికవరి కేసుల నుండి కాపాడలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు రూపాయలు 5వేలు పెన్షన్ ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.