టీఎస్ జేయు కార్యవర్గం ఏర్పాటు
నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రెస్ క్లబ్లో టీఎస్ జేయు లక్ష్మణచందా మండలం కార్యవర్గానికి శుక్రవారం రోజు టిఎస్ జేయు జిల్లా కార్యవర్గం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా టిఎస్ఎయు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ అరువైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కాకార్డుల మంజూరుకి కృషి చేస్తామన్నారు. అలాగే టిఎస్ జేయు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ప్రమాద బీమా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులలో రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులను టిఎస్ జేయు భరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల మంజూరికి పోరాడుతుందని పేర్కొన్నారు. టిఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం ఆదేశాల మేరకు త్వరలో విద్యార్థులకు, యువకులకు, జిల్లా ప్రజలకు మత్తు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.






