సింగరేణి ఏరియా డైరెక్టర్ సమక్షంలో సమీక్ష సమావేశం
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని,వివిధ ప్రాజెక్టుల పురోగతి, ఉత్పత్తి లక్ష్యాలు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యత ప్రమాణాలను పాటించడం, భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
డైరెక్టర్ (పి&పీ) శ్రీ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రతి విభాగం సమన్వయంతో పని చేస్తే ,సంస్థ లక్ష్యాలను సమయానికి సాధించవచ్చని పేర్కొన్నారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఏరియా జీఎం శాలెం రాజు ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను వివరించి, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. సంబంధిత అధికారులకు పనులను వేగవంతం చేయాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అదేవిధంగా, పర్యావరణ పరిరక్షణ చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.






