11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

గండిలచ్చపేటలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

22-11-2025 07:28 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పోల్స్‌ను పునర్నిర్మాణం చేసి మళ్లీ విద్యుత్ సరఫరాను ప్రారంభించామని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఈ పనులకు మొత్తం రూ.2,50,000 వ్యయం చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు నాసిరకం మోటార్లు ఉపయోగించకుండా, నాణ్యమైన మోటార్లను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.