4 July, 2026 | 10:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల కాన్ఫరెన్స్

18-12-2025 12:24 AM

శుక్ర,శనివారాల్లో రామోజీ సిటీలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఈనెల 19, 20వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నట్లు బుధవారం పేర్కొంది. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లతోపాటు రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపింది. సదస్సులో పారదర్శకంగా పరీక్షల నిర్వహణ, తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులు, సంస్కరణలు, అమలు చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చర్చించనున్నట్లు తెలిపింది.