4 July, 2026 | 8:43 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

కోడిపుంజుకు అత్యవసర శస్త్రచికిత్స

18-12-2025 12:24 AM

అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

కోదాడ, డిసెంబర్ 17: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కోడిపుంజుల పెంపకందారు నవీన్ తన ఆరు కిలోల కోడిపుంజు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బుధవారం కోదాడ పశువైద్యశాలకు తీసుకవచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య వెంటనే అత్యవసర శస్త్ర చికిత్స చేయడంతో కోలుకుంది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య మాట్లాడుతూ కోడిపుంజు యజమాని నవీన్ బలం కోసం కోడిపుంజుకు మటన్ తినిపించడంతో, ముక్కలు బొరిగలో ఇరుక్కపోయి, ఏం తినలేక అనారోగ్యానికి గురైందన్నారు. సమస్య గుర్తించి శస్త్రచికిత్స ద్వారా బొరిగను శుభ్రం చేసినట్లు వివరించారు. నాణ్యత గల దాణా వాడాలని సూచించారు. శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు, అఖిల్, హరికృష్ణ పాల్గొన్నారు.