విద్యార్థులకు యూనిఫామ్లు అందజేత
28-02-2026 02:54 AM
తాడ్వాయి, ఫిబ్రవరి, 27(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో శుక్రవారం శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి విద్యార్థులకు యూనిఫామ్ లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ దత్తాత్రేయ స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు యూనిఫాం లు అందించినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. తాను ఇక్కడే చదువుకున్నానని పాఠశాల అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.




