పీఆర్సి వెంటనే అమలు చేయాలి
పెండింగ్ డిఏ బిల్లులను చెల్లించాలి
నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన
టీపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్
గాంధారి,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ టీఏలు చెల్లించాలని టీజీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గాంధారి ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని టీజీజేఏసీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధారి ఉన్నత పాఠశాల లో పీఆర్సీ వెంటనే అమలు, పెండింగ్ డీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






