8 July, 2026 | 5:03 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

పీఆర్సి వెంటనే అమలు చేయాలి

17-04-2026 08:33 PM

పెండింగ్ డిఏ బిల్లులను చెల్లించాలి

నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన

టీపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్

గాంధారి,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ టీఏలు చెల్లించాలని టీజీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గాంధారి ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని టీజీజేఏసీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధారి ఉన్నత పాఠశాల లో  పీఆర్సీ వెంటనే అమలు, పెండింగ్ డీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.