17 April, 2026 | 10:05 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వీసీని కలిసిన నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు

17-04-2026 08:36 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై పరస్పరం చర్చించి విశ్వవిద్యాలయాన్ని విద్యాబోధనలో పరిశోధనలలో ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేయగా, ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నూతన సభ్యులకు అభినందనలు తెలియజేసి, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.