కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ
08-07-2026 04:12 PM
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో రైతు వేదికలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బొయిని నిర్మల జయరాజు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరం అని.. పేర్కొన్నారు. చెక్ ల మంజూరు కు సహకరించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి, శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.






