8 July, 2026 | 4:59 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు

08-07-2026 03:52 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నాచారం ఎక్స్ రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షులు, నాచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహానేత ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.వైఎస్సార్ అందించిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.