వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి
15-06-2026 07:14 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని గానుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ గుర్రం వెంకటరెడ్డి కుటుంబాన్ని సోమవారం సాయంత్రం కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్రం వెంకటరెడ్డి ఆకస్మిక మృతి మండలంలోని కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వెంకటరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. మొదట వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.






