ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
15-06-2026 07:29 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో సోమవారం హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లు కట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలు పూర్తయిన లబ్ధిదారులను, నిర్మాణం జరగకుండా ఉన్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగయ్య, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ యోగి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మేకపోతు అఖిల్, పంచాయతీ కార్యదర్శి గుగులోతు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.






