calender_icon.png 11 February, 2026 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాద్ నగర్ లో ప్రశాంతంగా మొదలైన పోలింగ్

11-02-2026 11:56:43 AM

మున్సిపల్ లో 53,403 ఓటర్లు 

 28 వార్డులు, 92మంది అభ్యర్థులు 

 పురుషులు - 26,679, మహిళలు -26723 ఓటర్లు, ఇతరులు 01 

 మొత్తం వార్డులు- 28, పోలింగ్ సిబ్బంది 380మంది

పోలింగ్ స్టేషన్లు - 76 

షాద్‌నగర్ ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.  డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ కమిషనర్ సునీతారెడ్డి పరివేక్షణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. షాద్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు -53,403 ఉండగా ఇందులో పురుషులు - 26,679, మహిళలు -26723, ఇతరులు- 01, మొత్తం వార్డులు- 28, పోలింగ్ సిబ్బంది 380 మంది, పోలింగ్ స్టేషన్లు - 76 ఉండగా షాద్ నగర్ డిసిపి సిహెచ్ శిరీష నేతృత్వంలో ఏసిపి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్త్ 200మందితో ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి.