25 March, 2026 | 3:23 PM

Breaking News

వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి   •   పోగొట్టుకున్న ఫోన్లని బాధితులకి అప్పగించిన ఎస్సై   •   పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు.. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు   •   పొంచి ఉన్న ప్రమాదం   •   గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •  

పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!

25-03-2026 01:32 PM

బాటిల్లు డబ్బాల్లో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్న వాహనదారులు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా దాడుల నేపథ్యంలో భారత దేశంలో ఇంధన కొరత, ధరల పెరుగుదల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా పెట్రోల్ బంకుల్లో(petrol pumps) ఇంధన కొరత ఉన్నట్లు నో స్టాక్ బోర్డులు తగిలించారు. దీంతో వాహనదారుల్లో మరింత ఆందోళన పెరగడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం కార్లు, బైకులు, ఆటోలు క్యూలో నిల్చున్నాయి.

మరి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయడంతో పాటు ఇతర బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.  ఫలితంగా ఇతర వస్తువుల క్రయ విక్రయ ధరల్లోను తీవ్ర ప్రభావం చూపుతోందని సామాన్యులు మండిపడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతలు, నాణ్యత వంటి ప్రమాణాలు పాటించకపోయినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.