కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి
కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి నిదర్శనం: డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలవటానికి కృషి చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.ఆయన సోమవారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో బీ ఎల్ ఏ, సర్ మ్యాపింగ్ కార్యక్రమం 90 శాతం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.






