24 February, 2026 | 8:04 PM

ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి

24-02-2026 05:51 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం దోమల నివారణకై మేడ్చల్ జిల్లా ఐ ఎన్ టి సి అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి  సమకూర్చిన ఆధునిక ఫాగింగ్ యంత్రాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి మంగళవారం రోజున  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నాచారం హెచ్ఎంటి ప్రాంతాల్లో పెద్ద చెరువులో గుర్రపు డెక్క పేరుకుపై దోమలు విపరీతంగా వ్యాపించాయని ప్రజల ఆరోగ్యం దృష్ట సీజన్ వ్యాధులు నివారణకై ఫాగింగ్  యంత్రాన్ని ఏర్పాటు చేశామని  ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యంత్రాన్ని అందజేసిన ప్రకాష్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాచారం కాంగ్రెస్ నాయకులు బండారి శ్రీకాంత్ గౌడ్ కృష్ణారెడ్డి హెచ్ ఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు