27 June, 2026 | 8:33 PM

మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు

27-06-2026 07:09 PM

చేర్యాల: చేర్యాల పెద్ద చెరువు కట్టపై ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అధికారులు ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణను మాత్రం పూర్తిగా గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం చేర్యాల మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి అలవాటుగా మారింది. కేవలం ఫోటోల ప్రచారం కోసమే కాకుండా,పర్యావరణంపై నిజమైన బాధ్యతతో పని చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించి, నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి,నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని చేర్యాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.