ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాదవ్ ఇంట్లో తీవ్రవిషాదం
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్(Mulayam Singh Yadav Son Prateek Yadav Dies) యాదవ్ చిన్న కుమారుడు, అఖిలేష్ యాదవ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్(Prateek Yadav Death) బుధవారం లక్నోలో మరణించారు. 38 ఏళ్ల ప్రతీక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో, తెల్లవారుజామున హుటాహుటిన సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చేరగానే వైద్యులు అతన్ని మృతి చెందినట్లు ప్రకటించారు. ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవాడైనప్పటికీ, ఫిట్నెస్ పట్ల ఎంతో ఆసక్తి కలిగిన ప్రతీక్(Prateek Yadav's Fitness), క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, ఆయన భార్య అపర్ణ బిష్త్ యాదవ్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
దివంగత సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు(Founder of the Samajwadi Party) ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్(BJP leader Aparna Yadav) భర్త అయిన ప్రతీక్ యాదవ్కు పోస్టుమార్టం నిర్వహించేందుకు లక్నో సివిల్ ఆసుపత్రి(Lucknow Civil Hospital) ప్రధాన వైద్య అధికారి నలుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ ఉదయం 10:00 గంటల ప్రాంతంలో ప్రారంభం అయింది. మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి ఈ బృందం పోస్ట్మార్టం నిర్వహిస్తుంది. దీనికి అరగంట సమయం పడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)కి చెందిన వైద్యుల బృందం కూడా శవపరీక్షను నిర్వహిస్తుంది. KGMU, నిపుణుల స్థాయి వైద్యులైన డాక్టర్ మౌసమి, డాక్టర్ శివ్లితో కూడిన ఇద్దరు సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ప్రతీక్ యాదవ్ మృతిపై అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం
తన సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ మరణం పట్ల తాను "తీవ్రంగా చింతించానని" సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav) బుధవారం తెలిపారు. హిందీలో చేసిన ఒక ఎక్స్ పోస్ట్లో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇలా రాశారు. "ప్రతీక్ యాదవ్ కన్నుమూయడం అత్యంత విచారకరం! ఆ దివంగత ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. నా వినమ్ర నివాళి!" అంటూ ఎక్స్ పోస్టు చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోస్ట్మార్టం పరీక్ష నిమిత్తం ప్రతీక్ యాదవ్ మృతదేహాన్ని భద్రపరిచిన KGMUలోని పోస్ట్మార్టం కేంద్రానికి చేరుకున్నారు.






