12-02-2026 02:05:47 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి) : పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండడంతో పద్మావతి కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సతిమణి ప్రసన్న తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించి ఓటింగ్ శాతం పెంచాలని సూచించారు.