శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు
22-05-2026 03:35 PM
నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేరళ రాష్ట్రంలోని గురు వాయుర్లోని కృష్ణ భగవానుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. గురువారం కుటుంబ సమేతంగా దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.






