23 May, 2026 | 7:24 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

మత్స్యకారుల సంక్షేమం మదన్ మోహన్ లక్ష్యం

30-10-2025 01:43 PM

ఏల్లారెడ్డి మండల కేంద్రంలో 1000 గజాల స్థలాన్ని మత్స్య మార్కెట్ నిర్మాణానికి మంజూరు

వృత్తి అభివృద్ధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధి  ఎమ్మెల్యే మదన్ మోహన్ నిబద్ధతను ప్రజలు ప్రశంసిస్తున్నారు

ఎల్లారెడ్డి మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రయత్నాలతో ఒక పెద్ద అడుగు ముందుకేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యెల్లారెడ్డి మండల కేంద్రంలో 1000 గజాల స్థలాన్ని మత్స్య మార్కెట్ నిర్మాణానికి మంజూరు చేసింది. మత్స్యకారుల సంఘ ప్రతినిధులు ఇటీవల ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలసి, యెల్లారెడ్డి, సదాశివనగర్, లింగంపేట్, గాంధారి మండల కేంద్రాల్లో మత్స్య మార్కెట్లు మరియు చేపల నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఈ పేద మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కేంద్రాలు కీలకమని గుర్తించిన ఎమ్మెల్యే  వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపించి, ప్రభుత్వ స్థాయిలో నిరంతర అనుసరణ చేశారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్  కృషితో  యెల్లారెడ్డి మండల మత్స్య మార్కెట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. సదాశివనగర్ మండల మత్స్య మార్కెట్ నిర్మాణానికి స్థలం మంజూరు అయి, పనులు వేగంగా సాగుతున్నాయి.లింగంపేట్ మండలానికి స్థల మంజూరు పూర్తయింది. గాంధారి మండలానికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.మత్స్యకారుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధి పట్ల ఎమ్మెల్యే మదన్ మోహన్  నిబద్ధతను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి వృత్తి వర్గం అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుని గ్రామాల నుండి రాష్ట్ర స్థాయి అధికారులతో చురుకుగా సమన్వయం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు.మత్స్యకారుల భవిష్యత్తు మెరుగుపరచడమే లక్ష్యంగా, ఎమ్మెల్యే మదన్ మోహన్  పాలనలోనే ఎల్లారెడ్డి అభివృద్ధి సాక్షిగా నిలుస్తోంది.