పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో అగ్నిప్రమాదాల వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అదే విధంగా చూస్తామని ఎమ్మెల్యే జాదవ్ అని పేర్కొన్నారు. గురువారం ఇచ్చోడ మండలంలోని దువర్పేట్ గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించారు గ్రామానికి చెందిన కట్టె రమేష్ కు చెందిన పంట షాక్ సర్క్యూట్ అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో కాలిపోయిన పంటను పరిశీలించారు.
నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో షార్ట్ సర్క్యూట్ తో చేతికి అందే పంటలు కాళీ బూడిదైందని వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ..ప్రభుత్వం ఆదుకునే విధంగా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని గ్రామస్తులు పేర్కొనగా నూతన బోరుబావి ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం జరిగింది ఆయన వెంట మండలంలోని పలు గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






