పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి
10-07-2026 06:18 PM
బేల,(విజయక్రాంతి): బేల మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయం (MJP)ను నేడు మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్, వైద్య ఆరోగ్య శాఖా సిబంది కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు వసతి, సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగది (కిచెన్), స్టోర్ రూమ్తో పాటు పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని పాఠశాల ప్రిన్సిపాల్ గణేష్ సార్, సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






