విద్యుత్ సరఫరాలో అంతరాయం
10-07-2026 06:45 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 11వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 33కేవీ ఫీడర్ లో లైన్ మరమ్మతుల కారణంగా శని వారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు లక్షేట్టిపేట, ఉత్కుర్, మొదెల, గంపలపల్లి, ఇటిక్యాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. మరమ్మత్తుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.






