సమాన పనికి... సమాన వేతనం చెల్లించాలి
కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి
జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని... కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణమని... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని స్త్రీ పురుష సమానత్వానికి మహిళలోకం సంఘటితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిఓడబ్ల్యు (విముక్తి) కన్వీనర్ పెరిక సునీత పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఓడబ్ల్యు (విముక్తి) సునీత ఆధ్వర్యంలో మంగళవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... ఆదివాసీ మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. మహిళల్ని గౌరవించే ప్రజాస్వామ్యంలో ఉన్న దేశం ఏఐ వంటి టెక్నాలజీతో దూసుకుపోతున్న మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదని విమర్శించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, సంతోష్ నాయక్, రాణి, నందిని, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




