26 April, 2026 | 8:54 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

సమాన పనికి... సమాన వేతనం చెల్లించాలి

24-02-2026 06:38 PM

కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని... కుల రక్కసికి పసిపాప ప్రాణం పోవడం దారుణమని... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని స్త్రీ పురుష సమానత్వానికి మహిళలోకం సంఘటితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిఓడబ్ల్యు (విముక్తి) కన్వీనర్ పెరిక సునీత పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఓడబ్ల్యు (విముక్తి) సునీత ఆధ్వర్యంలో మంగళవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... ఆదివాసీ మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. మహిళల్ని గౌరవించే ప్రజాస్వామ్యంలో ఉన్న దేశం ఏఐ వంటి టెక్నాలజీతో దూసుకుపోతున్న మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదని విమర్శించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, సంతోష్ నాయక్, రాణి, నందిని, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.