10 June, 2026 | 6:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ మార్గం

10-06-2026 05:30 PM

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): పశు సంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ మార్గమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.

లంపీ స్కిన్, గొంతువాపు, జబ్బవాపు వంటి అంటువ్యాధుల కారణంగా పశుసంపదకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను ప్రతి పశువుకు తప్పనిసరిగా వేయించి పశుసంపదను సంరక్షించాలని రైతులకు సూచించారు. పశువులకు ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్య అధికారులను సంప్రదించాలని, వ్యాధుల నివారణలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని కలెక్టర్ హితవు పలికారు.