calender_icon.png 4 February, 2026 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీయూ డిగ్రీ 12 బ్యాక్ లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం

04-02-2026 12:00:00 AM

నల్గొండ టౌన్, ఫిబ్రవరి 3: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్ లాగ్  పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు సిఓఈ డా ఉపేందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆలస్య రుసుము లేకుండా మార్చి 4 వరకు చెల్లించవచ్చునని, 100 రూపాయల ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు చెల్లించవచ్చన్నారు.

రెండు సబ్జెక్టులలోపు పరీక్ష రుసుము చెల్లించేవారు- బిఎ విద్యార్థులు 625, బీకాం మరియు బీకాం కంప్యూటర్స్ 675 , బీఎస్సీ విద్యార్థులు 675 చెల్లించాలన్నారు. మూడు సబ్జెక్టులకు పైబడిన బిఏ విద్యార్థులు 950, బీకాం బీకాం కంప్యూటర్స్ 1015, బి ఎస్ సి 1015 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వ్బుసైట్, సంబంధిత కళాశాలను సంప్రదించాలని కోరారు.