29 July, 2026 | 9:13 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

తెలంగాణ ఉద్యమ యోధుడు మురళీధర్ దేశ్ పాండేకు కవిత నివాళి

11-06-2026 02:26 AM

నాగోల్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే మృతికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన కవిత, మురళీధర్ దేశ్ పాండే పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో మురళీధర్ దేశ్ పాండే చేసిన సేవలు చిరస్మరణీయమని కవిత పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, ప్రజా హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. కాగా, మురళీధర్ దేశ్ పాండే బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కొత్తపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.